This Day in History: 1984-05-23
1984 : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ పర్వతారోహకురాలిగా బచేంద్రీ పాల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఐదవ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సాధించింది. ఆమె పుట్టిన రోజు కు ఒకరోజు ముందు ఈ విజయం సాధించింది. మధ్యాహ్నం 1:07 ని”లకు 29, 084 అడుగల ఎత్తు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ను చేరుకొని. దుర్గా మాత పటాన్ని, హనుమాన్ చాలీసాను పర్వతాగ్రంపై ఉంచి, తాను సాధించిన ఘనతకు భగవంతుని కటాక్షమే కారణమని భక్తిపారవశ్యంలో చాటింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నది.