- సంఘటనలు
1977 : భారతదేశ 4వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి భవన్ లో గుండెపోటుతొ మరణించాడు.
1977 : భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతిగా బి డి జట్టి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2010 : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా టి మీనా కుమారి పదవి బాధ్యతలు స్వీకరించింది.
- జననం
1847 : థామస్ ఆల్వా ఎడిసన్ జననం. అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, ఎలెక్ట్రిక్ పెన్, మోషన్ పిక్సర్ కెమెరా వంటి అనేక పరికరాలు కనిపెట్టాడు.
1865 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం. భారతీయ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.
- మరణం
1946 : సింగరవేలర్ (మలయపురం సింగరవేలు) మరణం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, మార్గదర్శకుడు. 'లేబర్ కిసాన్ ఆఫ్ హిందుస్థాన్' రాజకీయపార్టీ వ్యవస్థాపకుడు.
1974 : పద్మశ్రీ ఘంటసాల (ఘంటసాల వెంకటేశ్వరరావు) మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సంగీత దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు అన్నమాచార్య తరవాత ములవిరాట్ కు రెండవ ఆస్థాన సంగీత విద్వాంసుడు. పోస్టల్ స్టాంప్ గౌరవం పొందిన దక్షిణాదికి చెందిన మొదటి సినీ గాయకుడు, సంగీతకర్త.
1977 : ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 5వ రాష్ట్రపతి.
చరిత్ర కొనసాగుతుంది..
వాలెంటైన్స్ వారోత్సవం (ప్రామిస్ డే - ఐదవ రోజు)