- దినోత్సవం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
జాతీయ తపాలా వారోత్సవం (ఇండియా)
- సంఘటనలు
1582 : గ్రెగరియన్ క్యాలెండర్ ఆవిష్కరించబడింది. అప్పటి వరకు అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా సూచించారు. మధ్యలో పదిరోజులను తప్పించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.
1932 : దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ('టాటా ఎయిర్ లైన్స్') కరాచీలోని డ్రిగ్ రోడ్ ఏరోడ్రోమ్ నుండి ముంబైలోని జుహు ఎయిర్స్ట్రిప్ కు ప్రారంభమైంది.
1949 : రాచరిక రాష్ట్రాలైన బనారస్ సంస్థానం (వారణాసి/కాశీ), త్రిపుర, మణిపూర్ లు భారతదేశం లో విలీనమయ్యాయి.
1990 : సోవియట్ యూనియన్ చివరి ప్రెసిడెంట్ మిఖాయిల్ సెర్గీవిచ్ గోర్బాచెవ్ కోల్డ్ వార్ ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు తన దేశాన్ని తెరవడానికి చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు.
1992 : ఎయిర్ ఇండియా 182 విమానం కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
2009 : ఎ.బి.ఎన్. (ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్) ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విజయం సాధించిన తర్వాత వేమూరి రాధాకృష్ణ ఈ ఛానెల్ని ప్రారంభించాడు.
- జననం
1542 : అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ (బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు) జననం. అక్బర్ ది గ్రేట్, అక్బర్ 1 అని కూడా పిలుస్తారు. ఆయన 1556 నుండి 1605 వరకు భారతదేశాన్ని పరిపాలించిన మూడవ మొఘల్ చక్రవర్తి. కొందరు గంగానది నుండి కలుషితమైన నీరు తాగడం వలన అక్బర్ విరోచనాలతో మరణించినట్లు, మరికొందరు విష ప్రయోగం జరిగిందని విశ్వసిస్తున్నారు.
1869 : రఘుపతి వెంకయ్య నాయుడు జననం. భారతీయ సినీ నిర్మాత, ఫోటోగ్రాఫర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, విద్యావేత్త, వ్యాపారవేత్త. తెలుగు సినిమా పితామహుడు.
1920 : పద్మ భూషణ్ భూపతిరాజు విస్సం రాజు జననం. భారతీయ పారిశ్రామికవేత్త. రాశీ సిమెంట్ వ్యవస్థాపకుడు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్. భారతీయ సిమెంట్ పరిశ్రమ మార్గదర్శకులలో ఒకడు.
1931 : భారతరత్న అబ్దుల్ కలాం (అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం) జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త. భారతదేశ 11వ రాష్ట్రపతి.
1939 : జి. రామకృష్ణ జననం. భారతీయ చలనచిత్ర నటుడు. ఆయన తెలుగు, తమిళం మరియు మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాలలో నటించాడు. అప్పటి కథానాయకి గీతాంజలి ఈయన భార్య.
1940 : పీటర్ చార్లెస్ డోహెర్టీ జననం. ఆస్ట్రేలియన్ సర్జన్ మరియు ఇమ్యునాలజిస్ట్. ఆల్బర్ట్ లాస్కర్ అవార్డు, నోబెల్ గ్రహీత. 1997 లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు.
1957 : మీరా నాయర్ జననం. భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత. ఆమె నిర్మాణ సంస్థ మీరాబాయి ఫిల్మ్స్. యునెస్కో అవార్డు, ఆసియన్ మీడియా అవార్డు, గోల్డెన్ లయన్ అవార్డు లాంటి ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు ఇండియా అబ్రాడ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2007, పద్మ భూషణ్ గౌరవ పురస్కారం పొందింది.
1975 : బ్లేజ్ (లక్ష్మీ నరసింహ విజయ రాజగోపాల శేషాద్రి శర్మ రాజేష్ రామన్) జననం. భారతీయ తమిళ, తెలుగు భాషా నేపథ్య గాయకుడు మరియు రాప్ సంగీతాన్ని రాయడంలో మరియు ప్రదర్శించడంలో నైపుణ్యం కలిగిన భారతీయ రాపర్.
1986 : పంజా సాయి ధరమ్ తేజ్ జననం. భారతీయ తెలుగు చిత్ర నటుడు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో తొలిసారిగా ప్రధాన పాత్ర పోషించాడు, దీనికి అతను ఉత్తమ నటుడు గా సంతోషం ఫిల్మ్ అవార్డు, సినీ మా అవార్డు, సైమా అవార్డు లను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కి మేనల్లుడు.
- మరణం
1918 : శిరిడీ సాయి బాబా మరణం. భారతీయ అధ్యాత్మికవేత్త, తత్వవేత్త, గురువు, సన్యాసి.
2000 : కోన్రాడ్ ఎమిల్ బ్లోచ్ మరణం. జర్మన్ అమెరికన్ బయోకెమిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత.
2020 : భాను అతయ (భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యే) మరణం. భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, పెయింటర్. అకాడమీ అవార్డు (OSCAR) ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు.
చరిత్ర కొనసాగుతుంది..