- దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ మే 12 అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం
- సంఘటనలు
1459 : రాజస్థాన్ లో జోధ్పూర్ నగరం నిర్మించబడింది.
1949 : భారతదేశపు మొదటి మహిళ విదేశీ రాయబారిగా విజయ లక్ష్మీ పండిట్కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది.
1955 : న్యూఢిల్లీ లోని నేషనల్ మ్యూజియం భవనం యొక్క పునాదిని భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశాడు.
1992 : ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 2వ భారతీయ మహిళగా సంతోష్ యాదవ్ నిలిచింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు అయింది.
2000 : మిస్ యూనివర్స్ 2000 కిరీటం భారతదేశానికి చెందిన లారా దత్తా గెలుచుకుంది.
- జననం
1820 : లేడి విత్ ద లెంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జననం. బ్రిటిష్ ఇటాలియన్ సంఘ సంస్కర్త, గణాంకవేత్త. ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు.
1923 : పద్మశ్రీ మీరా ముఖర్జీ జననం. భారతీయ శిల్పి, రచయిత్రి. పురాతన బెంగాలీ శిల్పకళకు ఆధునికతను తీసుకురావడానికి ప్రసిద్ధి చెందింది.
1930 : అడ్మిరల్ రాధాకృష్ణ హరిరామ్ తహిలియాని జననం. భరతీయ నౌకాదళ అధికారి. పరమ విశిష్ట సేవ మెడల్, అతి విశిష్ట సేవ మెడల్ గ్రహీత. సిక్కిం 6వ గవర్నర్. చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ 28వ ఛైర్మన్.
1945 : కోనకుప్పకతిల్ గోపీనాథన్ బాలకృష్ణన్ జననం. భారతదేశ 37వ ప్రధాన న్యాయమూర్తి.
1954 : ఎడప్పాడి కె. పళనిస్వామి జననం. భారతీయ రాజకీయవేత్త. తమిళనాడు 7వ ముఖ్యమంత్రి. మిథున్, ఇపిఎస్, ఏడియప్పన్ అని కూడా పిలుస్తారు.
- మరణం
1922 : మాస్టర్ సివివి (కంచుపాటి వెంకటరావు వెంకటసామి రావు) మరణం. భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక సంస్కర్త, యోగి, గురువు. భృక్త రహిత తారక రాజ యోగ (ఎలక్ట్రానిక్ యోగా) వ్యవస్థాపకుడు.
1984 : పద్మ భూషణ్ ముత్తయ్య అన్నమలై ముత్తయ్య చెట్టియార్ మరణం. భారతీయ బ్యాంకర్, రాజకీయవేత్త, పరోపకారి, సాంఘిక, సాంస్కృతిక కార్యకర్త. 'కుమార్-రాజా', 'చెట్టినాడ్ రాజా' బిరుదులు పొందాడు.
చరిత్ర కొనసాగుతుంది..