1806 : భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేత 'బ్యాంక్ ఆఫ్ కలకత్తా' స్థాపించబడింది.
1910 : ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై ఆగకుండా రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చార్లెస్ స్టీవర్ట్ రోల్స్ చరిత్ర సృష్టించాడు.
2014 : భారతదేశంలో 28వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
2014 : తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2023 : తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ నగరానికి సమీపంలో మూడు రైళ్లు (కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు) బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢీకొన్నాయి. సుమారు 300 మంది చనిపోగా 1000 మంది పైగా గాయపడ్డారు.