1965 : భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1964 చట్టం ప్రకారం 'ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (FCI) స్థాపించబడింది.
1969 : మద్రాసు రాష్ట్రం పేరు అధికారికంగా తమిళనాడు గా మార్చబడింది.
1994 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో స్థాపించబడిన మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం' గా పేరు మార్చబడింది.
1998 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను అందించారు. దీంతో ఆమె ఈ ఘనత అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించింది.