1971 : బహ్రెయిన్ దేశం యునైటెడ్ కింగ్ డమ్ నుండి స్వాతంత్ర్యం పొందింది.
1854 : తూర్పు భారతదేశంలోని ఈస్ట్ ఇండియన్ రైల్వే యొక్క మొదటి పాసెంజర్ రైలు హౌరా నుండి హుగ్లీ వరకు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది.
1907 : ఇండియన్ బ్యాంక్ మొదటిసారిగా మద్రాస్లో తమ కార్యకలాపాలు ప్రారంభించింది.
1945 : రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రోజు. జపాన్ చక్రవర్తి హిరోహిటో ఇంపీరియల్ జపాన్ లొంగిపోవడాన్ని ప్రకటించాడు
1947 : స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.
1947 : యునైటెడ్ ప్రావిన్స్ గవర్నర్ గా సరోజినీ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించింది.1949 : న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారిచే నేషనల్ మ్యూజియం ప్రారంభించబడింది.
1950 : అస్సాంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అధికారికంగా 1526 మంది ప్రజలు మరణించారు. దీనికి ది గ్రేట్ అస్సాం ఎర్త్క్ క్వేక్ ఆఫ్ 1950 అని పేరు పెట్టారు.1978 : ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.