- సంఘటనలు
1935 : భారతదేశంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) స్థాపించబడింది.
1935 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ గా ఒస్బోర్న్ ఆర్కెల్ స్మిత్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1936 : భారతదేశంలో ఒడిశా రాష్ట్రం ఆవిర్భవించింది.
2004 : గూగుల్ సంస్థ 'గూగుల్ మెయిల్' (GMail) ను ప్రారంభించింది.
- జననం
1889 : కె బి హెడ్గేవార్ (కేశవ్ బలిరామ్ హెడ్గేవార్) జననం. భారతీయ స్వతంత్ర్య కార్యకర్త, వైద్యుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు.
1907 : పద్మ భూషణ్ శివకుమార స్వామి (శివన్న లింగాయత్ గౌడ) జననం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, సూపర్ సెంటెనేరియన్. 'శ్రీ సిద్ధగంగ ఎడ్యుకేషన్ సొసైటీ' వ్యవస్థాపకుడు.
1936 : పద్మ భూషణ్ తరుణ్ గొగోయ్ జననం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి.
1937 : పద్మశ్రీ మొహమ్మద్ హమీద్ అన్సారీ జననం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 13వ ఉప రాష్ట్రపతి.
1941 : పద్మశ్రీ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ జననం. భరతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టెన్, కోచ్. అర్జున అవార్డు గ్రహీత.
- మరణం
1977 : సిరిల్ జాన్ రాడ్క్లిఫ్ మరణం. బ్రిటిష్ న్యాయ నిపుణుడు. బ్రిటిష్ ఇండియాను తూర్పు పాకిస్థాన్, ఇండియా, పశ్చిమ పాకిస్థాన్ అనే మూడు భాగాలుగా విభజించాడు.
2002 : పద్మశ్రీ కే వీ నారాయణస్వామి (కొల్లెంగోడ్ విశ్వనాథన్ నారాయణస్వామి అయ్యర్) మరణం. భరతీయ సంగీత విద్వాంసుడు.
చరిత్ర కొనసాగుతుంది..
ఏప్రిల్ ఫూల్స్ దినోత్సవం
ఒడిశా దినోత్సవం (ఇండియా)