- సంఘటనలు
1886 : యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ లో టవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు.
1970 : ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్లో 20 మిలియన్ల మంది ప్రజలతో 'ఎర్త్ డే' జరుపుకున్నారు.
1977 : 'GTE కార్పొరేషన్' సంస్థ టెలిఫోన్ ట్రాఫిక్లో మొదటిసారి ఆప్టికల్ ఫైబర్ ను ఉపయోగించింది.
1998 : హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి ఎం ఎన్ రావు పదవి విరమణ చేశాడు.
- జననం
1870 : లెనిన్ (వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్) జననం. రష్యన్ విప్లవకారుడు, రాజకీయవేత్త, సిద్ధాంతకర్త. సోవియట్ యూనియన్ వ్యవస్థాపక మొదటి అధినేత. మార్క్సిజమ్ నుండి 'లెనినిజమ్' సిద్ధాంతాన్ని సృష్టించాడు.
1883 : అంజనీబాయి మల్పేకర్ జననం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు.
1914 : పద్మ భూషణ్ బి ఆర్ చోప్రా (బల్దేవ్ రాజ్ చోప్రా) జననం. భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు, టెలివిజన్ ప్రజెంటర్. 'బి ఆర్ ఫిల్మ్స్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. 'మహాభారత్' నిర్మించాడు.
1916 : పద్మశ్రీ కనన్ దేవి (కనన్ బాల) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, గాయని, నిర్మాత. 'శ్రీమతి పిక్చర్స్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి బెంగాలీ నటి.
1936 : జస్టిస్ ఎం ఎన్ రావు (మాకాని నారాయణ రావు) జననం. భారతీయ న్యాయ నిపుణుడు. హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి.
1944 : స్టీవ్ ఫోసెట్ (జేమ్స్ స్టీఫెన్ ఫోసెట్) జననం. అమెరికన్ వ్యాపారవేత్త, వైమానికుడు, నావికుడు. బెలూన్లో మరియు ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా నాన్స్టాప్గా ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తి.
1945 : గోపాలకృష్ణ గాంధీ జననం. భారతీయ అడ్మినిస్ట్రేటర్, దౌత్యవేత్త. పశ్చిమ బెంగాల్ 22వ గవర్నర్. బీహార్ 21వ గవర్నర్. మహాత్మా గాంధీ మరియు సి. రాజగోపాలాచారి (రాజాజీ) ల మనవడు.
1959 : దగ్గుబాటి పురందేశ్వరి (నందమూరి పురందేశ్వరి) జననం. భారతీయ రాజకీయవేత్త, నృత్యకారిణి. 'దక్షిణాది సుష్మా స్వరాజ్' బిరుదును పొందింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమార్తె.
- మరణం
1933 : సర్ ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ మరణం. బ్రిటీష్ ఇంజనీర్, మార్గదర్శకుడు. కార్ల నిర్మాణ సంస్థ 'రోల్స్ రాయిస్ లిమిటెడ్' సహవ్యవస్థాపకుడు.
2001 : ఎం ఎ ఖాన్ (కున్వర్ మహమూద్ అలీ ఖాన్) మరణం. భారతీయ న్యాయవాది, రైతు, రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 14వ గవర్నర్.
2013 : పద్మ భూషణ్ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ మరణం. భారతీయ కర్నాటక వయోలిన్, గాయకుడు, స్వరకర్త. నాద విద్యా తిలక, నాద విద్యా రత్నాకర, వాద్య సంగీత బిరుదులను పొందాడు.
2013 : పద్మ భూషణ్ జగదీష్ శరణ్ వర్మ మరణం. భారతీయ న్యాయనిపుణుడు. భారతదేశ 27వ ప్రధాన న్యాయమూర్తి.
చరిత్ర కొనసాగుతుంది..
భూమి దినోత్సవం
అంతర్జాతీయ భూమాత దినోత్సవం