- దినోత్సవం
అంతర్జాతీయ రీడ్ టు మి దినోత్సవం
- సంఘటనలు
1954 : భారత వైమానిక దళానికి చెందిన 1వ హెలికాప్టర్ (సికోర్స్కీ S-55- IZ648), ఓడలో ముంబయికి చేరుకుంది.
1998 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి ఐ కె గుజ్రాల్ పదవి విరమణ చేశాడు.
1998 : భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
- జననం
1920 : పద్మశ్రీ జాఫర్ రషీద్ ఫుతేహల్లీ జననం. భారతీయ ప్రకృతి శాస్త్రవేత్త. 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్-ఇండియా' (WWF-India) వ్యవస్థాపక ట్రస్టీ.
1922 : రక్తకన్నీరు నాగభూషణం (చుండి నాగభూషణం) జననం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, పరోపకారి.
1938 : పద్మ భూషణ్ సాయి పరంజ్పే జననం. భారతీయ సినీ దర్శకురాలు, స్క్రీన్ రైటర్, రచయిత, నాటక రచయిత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్.
1952 : పద్మశ్రీ మోహన్ బాబు (మంచు భక్తవత్సలం నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ బిరుదులు పొందాడు.
1984 : మిస్ ఇండియా యూనివర్స్ తనుశ్రీ దత్తా జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. 2004 ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ విజేత.
1984 : అవసరాల శ్రీనివాస్ జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, టెలివిజన్ ప్రెజెంటర్.
- మరణం
1998 : ఇఎంఎస్ (ఎలంకులం మనక్కల్ శంకరన్ నంబూద్రిపాద్) మరణం. భారతీయ కమ్యూనిస్ట్ రాజకీయవేత్త, సిద్ధాంతకర్త, రచయిత. కేరళ మొదటి ముఖ్యమంత్రి.
2008 : రఘువరన్ (రఘువరన్ వేలాయుధం నాయర్) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, స్వరకర్త, గాయకుడు.
చరిత్ర కొనసాగుతుంది..