- దినోత్సవం
ప్రపంచ గ్లకోమా దినోత్సవం
మారిషస్ జాతీయ దినోత్సవం
సైబర్ సెన్సార్షిప్కు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం
- సంఘటనలు
1930 : మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది.
1954 : భారతదేశం యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ 'సాహిత్య అకాడమీ' స్థాపించబడింది.
1962 : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1962 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి దామోదరం సంజీవయ్య పదవి విరమణ చేశాడు.
2007 : భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
- జననం
1911 : భౌసాహెబ్ దయానంద్ బందోద్కర్ (దయానంద్ బాలకృష్ణ బందోద్కర్) జననం. భరతీయ రాజకీయవేత్త. గోవా మొదటి ముఖ్యమంత్రి. 'మహారాష్ట్రవాది గోమంతక్' రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
1913 : యశ్వంతరావు బల్వంతరావు చవాన్ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. బొంబాయి రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారతదేశ 5వ ఉప ప్రధానమంత్రి.
1954 : పద్మ భూషణ్ అనిష్ మిఖాయిల్ కపూర్ జననం. భారతీయ బ్రిటీష్ శిల్పి.
1984 : శ్రేయా ఘోషల్ జననం. భారతీయ నేపధ్య గాయని, టెలివిజన్ ప్రెజెంటర్.
చరిత్ర కొనసాగుతుంది..