- దినోత్సవం
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం
స్థూల మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సత్యం కోసం మరియు బాధితుల గౌరవం కోసం అంతర్జాతీయ దినోత్సవం
ప్రపంచ కబడ్డీ దినోత్సవం
- సంఘటనలు
1952 : అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా హరిభావు ఉపాధ్యాయ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1967 : హర్యానా 2వ ముఖ్యమంత్రిగా రాజారావు బీరేందర్ సింగ్ పదవి ప్రమాణం చేశాడు.
1977 : భారతదేశ 4వ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు.
1977 : భారతదేశ ప్రధానమంత్రి పదవి నుండి ఇందిరా గాంధీ పదవి విరమణ చేసింది.
1998 : లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2018 : 'వరల్డ్ కబడ్డీ' స్థాపించబడింది.
2020 : COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా నివారణ చర్యగా భారతదేశం మొత్తం అర్ధరాత్రి 12గంటల నుండి 21 రోజుల పాటు పూర్తి లాక్డౌన్లో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించాడు.
- జననం
1892 : పద్మ భూషణ్ హరిభావు ఉపాధ్యాయ జననం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, సామాజిక కార్యకర్త, రచయిత, రాజకీయవేత్త. అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.
1922 : పద్మశ్రీ టిఎంఎస్ (తొగులువ మీనచ్చి అయ్యంగార్ సౌందరరాజన్) జననం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు, తమిళ నేపథ్య గాయకుడు, సినీ నటుడు.
1979 : ఇమ్రాన్ హష్మీ జననం. భారతీయ హిందీ సినీ నటుడు, గాయకుడు, రచయిత.1986 : రమ్య నంబేసన్ జననం.
- మరణం
1971 : పద్మ భూషణ్ రాధికారామన్ ప్రసాద్ సింహా మరణం. భరతీయ హిందీ రచయిత, సామాజిక కార్యకర్త.
2015 : మల్లి మస్తాన్ బాబు మరణం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు.
2017 : గ్రంధి సుబ్బారావు మరణం. భారతీయ వ్యాపారవేత్త, అన్నదాత, పరోపకారి, ఆధ్యాత్మికవేత్త. 'క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' వ్యవస్థాపకుడు. అనేక చోట్ల దేవాలయాలు, అన్నదాన సత్రాలు కట్టించాడు.
చరిత్ర కొనసాగుతుంది..