- దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
- సంఘటనలు
1956 : ఆంధ్రరాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేయడం కోసం పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
1964 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.
1987 : భారతదేశంలో 24వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ అవతరించింది.
1987 : భారతదేశంలోని 23వ రాష్ట్రంగా మిజోరాం అవతరించింది.
1988 : మహారాష్ట్ర గవర్నర్గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాడు.
2014 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును రాజ్యసభలో ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించడానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది.
- జననం
1921 : రాజా రావు బీరేందర్ సింగ్ జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. హర్యానా 2వ ముఖ్యమంత్రి. 'విశాల్ హర్యానా' రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.
1935 : ఎన్ జనార్ధన్ రెడ్డి (నేదురుమల్లి జనార్దన రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి.
1946 : విజయ నిర్మల (నిడుదవోలు నిర్మల) జననం. భారతీయ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత. 'విజయ కృష్ణ మూవీస్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు.
- మరణం
1950 : శరత్ చంద్రబోస్ మరణం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. సుభాస్ చంద్రబోస్ సోదరుడు. 'సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ' వ్యవస్థాపకుడు. బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.
2010 : పద్మనాభం (బసవరాజు వెంకట పద్మనాభ రావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. నంది అవార్డు గ్రహీత.
చరిత్ర కొనసాగుతుంది..