- దినోత్సవం
అంతర్జాతీయ మొక్కల ప్రశంసా దినోత్సవం
భారతీయ రైల్వే వారోత్సవం (నాల్గవ రోజు)
సియాచిన్ దినోత్సవం (ఇండియా)
అంతర్జాతీయ ఫంక్షనల్ నాడీ సంబందిత రుగ్మత అవగాహన దినోత్సవం
ప్రపంచ సార్కోయిడోసిస్ అవగాహన దినోత్సవం
- సంఘటనలు
1699 : సిక్కుల 10వ గురువు గురుగోవింద్ సింగ్ 'ఖల్సా పంత్' ను స్థాపించాడు.
1796 : అమెరికాలో మొట్టమొదటిగా తెలిసిన ఏనుగు, 'క్రౌనిన్షీల్డ్ ఎలిఫెంట్', భారతదేశంలోని బెంగాల్ నుండి అమెరికాకు వచ్చింది.
1919 : పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ విచక్షణా రహిత కాల్పులు జరిపించి సుమారు 379 మందిని చంపించాడు.
1948 : భారతదేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒడిశా రాజధాని నగరంగా భువనేశ్వర్కు శంకుస్థాపన చేశాడు.
1984 : సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైనిక దళాలు 'ఆపరేషన్ మేఘదూత్' అమలుచేశారు.
1984 : UAEలోని జరిగిన మొట్టమొదటి ఆసియా కప్ టోర్నమెంట్ లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ పోటీ పడగా గవాస్కర్ కెప్టెన్సీ లో ఇండియా ఆసియా కప్ ను గెలుచుకుంది.
- మరణం
1973 : పద్మశ్రీ బాల్రాజ్ సాహ్ని (యుధిష్ఠిర్ సాహ్ని) మరణం. పాకిస్తానీ భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, స్క్రీన్ రైటర్, రాజకీయవేత్త.
1990 : పద్మ భూషణ్ సుందరం బాలచందర్ అయ్యర్ మరణం. భారతీయ వీణా వాద్యకారుడు, సినీ నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు.
2007 : నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ (ధూళిపాళ సీతారామ శాస్త్రి) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. సన్యాస ఆశ్రమం స్వీకరించి 'శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి' గా మారిపొయాడు.
చరిత్ర కొనసాగుతుంది..
1940 : నజ్మా అక్బర్ అలీ హెప్తుల్లా జననం. భారతీయ రాజకీయవేత్త. మణిపూర్ 16వ గవర్నర్.