- దినోత్సవం
మహిళా పొదుపు దినోత్సవం (ఇండియా)- ఈక్వాలిటీ డే
జాతీయ అగ్నిమాపక దినోత్సవం (ఇండియా)
జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవం (ఇండియా)
భారతీయ రైల్వే వారోత్సవం (ఐదవ రోజు)
ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం
ప్రపంచ క్వాంటం దినోత్సవం
- సంఘటనలు
1837 : గ్రీస్ లో ఏథెన్స్ విశ్వ విద్యాలయం (నేషనల్ అండ్ కపోడిస్ట్రియన్ యూనివర్శిటీ ఆఫ్ ఏథెన్స్) అధికారికంగా స్థాపించబడినది.
1912 : ఇంగ్లాండ్ నుండి యునైటెడ్ స్టేట్స్ కు ప్రయాణిస్తున్న RMS టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రాత్రి 11:40 కు మంచు కొండను ఢీ కొట్టింది.1927 : VOLVO గ్రూప్ స్థాపించబడినది.
1951 : భారతదేశంలో దక్షణ రైల్వే జోన్ ప్రారంభించబడింది.
1952 : భారతదేశంలో ఉత్తర రైల్వే జోన్, ఈశాన్య రైల్వే జోన్ మరియు తూర్పు రైల్వే జోన్ ప్రారంభించబడ్డాయి.
- జననం
1629 : క్రిస్టియాన్ హ్యూజెన్స్ జననం. డచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, ఆవిష్కర్త. శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం 'టైటాన్' కనుగొన్నాడు.
1891 : భారతరత్న బి ఆర్ అంబేద్కర్ (భీమ్రావ్ రామ్జీ సక్పాల్) జననం. భారతీయ న్యాయవాది, అధ్యాపకుడు, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతజ్ఞుడు. భారత రాజ్యాంగ పితామహుడు.
1922 : పద్మ విభూషణ్ అలీ అక్బర్ ఖాన్ జననం. బంగ్లా భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సరోద్ వాయిద్యకారుడు, స్వరకర్త. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.
1939 : గొల్లపూడి మారుతీ రావు జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నాటక రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, టెలివిజన్ ప్రజెంటర్. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
1941 : పద్మ భూషణ్ సూర్యనారాయణన్ శ్రీనివాసన్ జననం. భారతీయ వైమానిక ఇంజనీర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) డైరెక్టర్.
1942 : మార్గరెట్ అల్వా (మార్గరెట్ నజరెత్) జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. గోవా 17వ గవర్నర్. గుజరాత్ 23వ గవర్నర్. రాజస్థాన్ 20వ గవర్నర్. ఉత్తారఖండ్ 4వ గవర్నర్.
1952 : బాబు మోహన్ (పల్లి బాబు మోహన రావు) జననం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త.
- మరణం
1865 : అబ్రహం లింకన్ మరణం. అమెరికా న్యాయవాది, రాజకీయవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 16వ అధ్యక్షుడు.
1950 : భగవాన్ రమణ మహర్షి (వెంకటరామన్ అయ్యర్) మరణం. భారతీయ హిందూ సన్యాసి, ఆధ్యాత్మిక గురువు, తత్వవేత్త.
1962 : భారతరత్న ఎంవి (మోక్షగుండం విశ్వేశ్వరాయ) మరణం. భారతీయ సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు. మైసూర్ రాజ్యానికి 19వ దివాన్.
1963 : పద్మ భూషణ్ రాహుల్ సాంకృత్యాయన్ (కేదార్నాథ్ పాండే) మరణం. భారతీయ హిందీ రచయిత, బహుభాషావేత్త, వ్యాసకర్త, పండితుడు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
2011 : రామిరెడ్డి (గంగసాని రామి రెడ్డి) మరణం. భారతీయ సినీ నటుడు, పాత్రికేయుడు.
2017 : పద్మ భూషణ్ గిరీష్ చంద్ర సక్సేనా మరణం. భారతీయ రాజకీయవేత్త. జమ్మూ & కాశ్మీర్ 8వ గవర్నర్.
చరిత్ర కొనసాగుతుంది..