1883 : దయానంద సరస్వతి (మూల శంకర్ తివారీ) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, సామాజిక గురువు. 'ఆర్య సమాజ్' వ్యవస్థాపకుడు. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలను ఎదురించి పోరాడాడు. హిందు ధర్మ సంస్థాపనకు పాటుపడ్డాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వరాజ్యం కోసం "భారతీయుల కోసం భారతదేశం" అని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి దయానంద.
1910 : జీన్ హెన్రీ డునాంట్ మరణం. స్విస్ మానవతావాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. 'రెడ్ క్రాస్' వ్యవస్థాపకుడు. మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.
1963 : పసుంపొన్ ఉక్కిరపాండి ముత్తురామలింగ తేవర్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, రైతు, రాజకీయవేత్త. తమిళనాడు 'తేవర్' కమ్యూనిటీ మూలపురుషుడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ డిప్యూటీ ఛైర్మన్. సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దక్షణ భారత ఓట్లన్నీ సమీకరించి మహాత్మా గాంధీ సపోర్టుతో వచ్చిన పట్టాభి మీద విజయం సాధించేలా చేశాడు.
1990 : పద్మ విభూషణ్ శాంతారాం రాజారాం వణకుద్రే మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.