- దినోత్సవం
రిపబ్లిక్ ఆఫ్ ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్య దినోత్సవం (ఫ్రాన్స్ నుండి)
ప్రపంచ తల్లిపాల వారోత్సవం
(చివరి రోజు)
జాతీయ చేనేత దినోత్సవం
(ఇండియా)
- సంఘటనలు
- 1905
1905 : భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావీన్స్ ను రెండుగా విభజించాలని ప్రకటించడటంతో నిరసనగా కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ మూవ్-మెంట్ (వందేమాతరం ఉద్యమం) అధికారికంగా మొదలైంది. - 1991
1991 : పంజాబ్ 22వ గవర్నర్ గా సురేంద్ర నాథ్ పదవి బాధ్యతలు స్వీకరించాడు. - 2021
2021 : టోక్యో 2020 ఒలింపిక్స్ పురుషుల జావెలిన్ త్రో విభాగంలో సుబేదార్ నీరజ్ చోప్రా ఇండియాకు మొదటి అథ్లెటిక్స్ స్వర్ణం సాధించాడు. - 2025 2024 లోక్సభ ఎన్నికల తర్వాత భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.2025 ఆగస్టు 7, కర్ణాటకలోని మహదేవపురలోనే లక్షకు పైగా నకిలీ, చెల్లని చిరునామాలు దొరికాయని కాంగ్రెస్ దర్యాప్తులో తేలిందని రాహుల్ గాంధీ పేర్కొన్నాడు.2024 లోక్సభ ఎన్నికల విషయంలో భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో బిజెపితో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.2023లో జరిగిన మహదేవపుర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపి చేతిలో ఓడిపోయింది.
- జననం
- 1702
1702 : షాహంషా నాసిర్ - ఉద్- దిన్ ముహమ్మద్ షా, అబు - ఫతాహ్ నాసిర్ - ఉద్-దీన్- రోషన్ అక్తర్ ముహమ్మద్ షా (రోషన్ అక్తర్) మొఘల్ సామ్రాజ్యాన్ని (1719-1748) వరకు పాలించాడు. ఆయన జహన్ షా కుజిస్తా అక్తర్ కుమారుడు. మొదటి బహదూర్ షా నాల్గవ కుమారుడు. ఆయనకు 17వ సంవత్సరంలో సయ్యద్ సోదరుల సహాయంతో మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం అయింది. - 1783
1783 : జాన్ హీత్కోట్, ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి. - 1887
1959 : పద్మ భూషణ్ కస్తూరి శ్రీనివాసన్ అయ్యంగార్ జననం. భారతీయ జర్నలిస్ట్, వ్యాపారవేత్త. ద హిందూ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎడిటర్. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. - 1925
1925 : భారతరత్న ఎం ఎస్ స్వామినాధన్ (మంకొంబు సాంబశివన్ స్వామినాథన్) జననం. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కల జన్యు శాస్త్రవేత్త, మానవతావాది. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. 'MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్' వ్యవస్థాపకుడు. - 1947
సుత్తివేలు 🔴
(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు)
జననం.
భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. - 1954
1954 : పద్మశ్రీ సురేష్ వాడ్కర్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, టెలివిజన్, ప్రజెంటర్, ఉపాధ్యాయుడు. - 1966
1966 : అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. లాభము ఆశించని ఛారిటబుల్ సంస్థ వికీ మీడియా ఫౌండేషన్, ను వికీయాను కూడా నడుపుతున్నారు. - 1984
1984 : సచిన్ జోషి జననం. భారతీయ నటుడు, నిర్మాత మరియు వ్యవస్థాపకుడు, టాలీవుడ్ మరియు బాలీవుడ్లో పేరుగాంచారు. అతని తండ్రి జగదీష్ జోషి, JMJ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యజమాని.
- మరణం
- 1941
1941 : విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం. భారతీయ బెంగాలీ పాలిమత్, కవి, రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త, చిత్రకారుడు. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. భారత జాతీయగీతం 'జనగణమన' ను రచించాడు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. - 1974
1974 : అంజనీబాయి మల్పేకర్ మరణం. భారతీయ శాస్త్రీయ గాయని. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకొన్న మొదటి మహిళ. రాజా రవివర్మ ఆమె రూపాన్ని ఊహిస్తూ చిత్రాలు వేసేవాడు. - 2018
2018 : కళైంగర్ కరుణానిధి (ముత్తువేల్ దక్షిణామూర్తి) మరణం. భారతీయ సినీ రచయిత, నాటక రచయిత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. తమిళనాడు 2వ ముఖ్యమంత్రి.
చరిత్ర కొనసాగుతుంది..