- దినోత్సవం
శాన్ మారినో గణతంత్ర దినోత్సవం
ఆస్ట్రేలియా జాతీయ జెండా దినోత్సవం
జాతీయ పోషక ఆహార వారోత్సవం (ఇండియా)
- జననం
- 1905
1905 : కమలపతి త్రిపాఠి జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, రచయిత, జర్నలిస్ట్. ఉత్తరప్రదేశ్ 7వ ముఖ్యమంత్రి.ఉత్తరప్రదేశ్ 2వ ఉప ముఖ్యమంత్రి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి. యునైటెడ్ ప్రావిన్స్ నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
- 1923
1923 : పద్మ విభూషణ్ కిషన్ మహారాజ్ జననం. భరతీయ వాయిద్యకారుడు, పండిట్. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బెనారస్ ఘరానాకు చెందిన
భారతీయ తబలా ప్లేయర్. - 1952
1952 : శక్తి కపూర్ (సునీల్ సికిందర్లాల్ కపూర్) జననం.భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ చిత్రాలలో విలన్ మరియు హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. నటి శ్రద్దా కపూర్ ఆయన కుమార్తె. - 1957
1957 : పద్మ విభూషణ్ సద్గురు (జగదీష్ వాసుదేవ్) జననం. భారతీయ యోగి, గురువు, మార్మికుడు. 'ఈషా ఫౌండేషన్' వ్యవస్థాపకుడు. - 1974
1974 : మల్లి మస్తాన్ బాబు జననం. భారతీయ పర్వతారోహకుడు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగువాడు. - 1976
1976 : వివేక్ ఒబెరాయ్ (వివేకానంద్ ఒబెరాయ్) జననం. భారతీయ సినీ నటుడు, స్క్రిప్ట్ రైటర్, పరోపకారి. సినీ నటుడు సురేష్ ఒబెరాయ్ కుమారుడు. - 1979
1979 : అర్జన్ బజ్వా జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. టైక్వాండో లో బ్లాక్ బెల్ట్ కలిగిఉన్నాడు. - 1981
1981 : కమల్ కామరాజు జననం. భారతీయ సినీ నటుడు, రచయిత, సహాయ దర్శకుడు, ఆర్కిటెక్ట్, ఏస్ ఫోటోగ్రాఫర్. - 1992
1992 : పద్మశ్రీ సాక్షి మాలిక్ జననం. భారతీయ ఫ్రీస్టైల్ రెజ్లర్. ఒలింపిక్స్లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్.
- మరణం
- 1987
1987 : పసుపులేటి రమేష్ నాయుడు మరణం. భారతీయ సంగీత స్వరకర్త, బహుళ వాయిద్యకారుడు, గాయకుడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత. - 2007
2007 : స్టీవ్ ఫోసెట్ (జేమ్స్ స్టీఫెన్ ఫోసెట్) మరణం. అమెరికన్ వ్యాపారవేత్త, వైమానికుడు, నావికుడు. బెలూన్లో మరియు ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా నాన్స్టాప్గా ఒంటరిగా ప్రయాణించిన మొదటి వ్యక్తి. - 2011
2011 : చక్కెర కళాప్రపూర్ణ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మరణం. భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, రాజకీయవేత్త. ఆంధ్రా షుగర్స్ స్థాపించాడు.
చరిత్ర కొనసాగుతుంది..
2009 : ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి గా కొణిజేటి రోశయ్య పదవి స్వీకారం చేశాడు.