- దినోత్సవం
అంతర్జాతీయ ఒరంగుటాన్ దినోత్సవం
అంతర్జాతీయ బో దినోత్సవం
ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం
ప్రపంచ మానవతా దినోత్సవం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
అంతర్జాతీయ టాక్ లైక్ జార్ జార్ బింక్స్ దినోత్సవం
- జననం
- 1871
1871 : ఆర్విల్ రైట్ జననం. అమెరికన్ ఏవియేషన్ మార్గదర్శకుడు. ప్రపంచంలోని మొట్టమొదటి విజయవంతమైన మోటారుతో నడపబడే విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ లో ఒకడు. - 1908
1908 : పద్మ భూషణ్ అబ్దుల్ రషీద్ ఖాన్ జననం. భారతీయ గాయకుడు, ఉస్తాద్, కవి, రచయిత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. పదహారవ శతాబ్దంలో అక్బర్ ది గ్రేట్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకరైన ప్రఖ్యాత గాయకుడు తాన్సేన్ వంశస్థుడు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత గాయకుడు. - 1918
శంకర్ దయాళ్ శర్మ 🔴
జననం.
భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు.
భారతదేశ 9వ రాష్ట్రపతి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. - 1925
1925 : అట్లూరి పుండరీకాక్షయ్య జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారు. - 1946
1946 : బిల్ క్లింటన్ (విలియం జెఫెర్సన్ క్లింటన్) జననం. అమెరికన్ రాజకీయవేత్త, న్యాయవాది, ప్రొఫెసర్, రచయిత. యునైటెడ్ స్టేట్స్ 42వ అధ్యక్షుడు. క్లింటన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. - 1950
1950 : పద్మశ్రీ సుధా మూర్తి (సుధా కులకర్ణి) జననం. భారతీయ రచయిత్రి, విద్యావేత్త, పరోపకారి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా'ను స్థాపించింది. - 1967
1967 : పద్మ భూషణ్ సత్య నారాయణ నాదెళ్ల జననం. భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, రచయిత. మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ మరియు CEO. మైక్రోసాఫ్ట్ యొక్క క్లౌడ్ & ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. 2018 టైమ్ 100 గౌరవ గ్రహీత. - 1989
మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్వాల్ జననం. భరతీయ నటుడు, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్. మిస్టర్ ఇండియా 2015 టైటిల్ విజేత. మిస్టర్ వరల్డ్ 2016 టైటిల్ విజేత.
- మరణం
- 0014
0014 : అగస్టస్ సీజర్ (గైయస్ ఆక్టేవియస్ థురినస్) మరణం. రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి. ఆయన పేరుతొ ఆగస్టు నెల ఏర్పడింది. - 1662
1662 : బ్లేజ్ పాస్కల్ మరణం. ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, తత్వవేత్త, రచయిత, కాథలిక్ వేదాంతి. పాస్కల్ సిద్దాంతం కనిపెట్టాడు. మెకానికల్ కాలిక్యులేటర్, సిరంజీ కనుగొన్నాడు.
చరిత్ర కొనసాగుతుంది..
1949 : ఒడిశా రాజధాని పూర్తిగా కొత్తగా పునర్నిర్మించిన భువనేశ్వర్కు మార్చబడింది.