This Day in History: 1890-11-28
1890 : మహాత్మా జ్యోతిబా ఫూలే (జ్యోతిరావు గోవిందరావు గోర్హే) మరణం. భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక కార్యకర్త, ఆలోచనాపరుడు, రచయిత. ‘దళితుడు’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే ను వివాహం చేసుకున్నాడు.
గోర్హే ఇంటిపేరు పూలు అమ్మడం వల్ల ఫూలే గా మారింది. అంటరానితన నిర్మూలన, కులవ్యవస్థ నిర్మూలన, స్త్రీలు మరియు అణగారిన కులాల ప్రజలను విద్యావంతులను చేయడంలో కృషి చేశాడు. ఆయన భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు.