సంఘటనలు – పేజీ 8 – On This Day  

2014-02-20

2014 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును రాజ్యసభలో ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజించడానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది.

1978-02-18

1978 : ప్రమచంలోనే అత్యంత వేడైన సహారా ఎడారిలో మంచు కురిసింది. సహారా ఎడారిలో మంచు కురిసిన మొదటి రికార్డు ఇదే.

2019-02-14

2019 : జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి (పుల్వామా దాడి) కారణంగా 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది.

 

1959-03-09

1959 : మొదటి బార్బీ బొమ్మ న్యూయార్క్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్‌లో తన అరంగేట్రం చేసింది.

1780-01-29

1780 : భారతదేశ మొట్టమొదటి ముద్రిత వార్తాపత్రిక ‘హికీస్ బెంగాల్ గెజెట్’ (ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వర్టైజర్) తన ప్రచురణను ప్రారంభించింది. ఇది ఒక ఐరిష్‌ వ్యక్తి ప్రారంభించిన ఆసియాలోనే మొదటి ఆంగ్ల వార్తా వార పత్రిక.

2024-01-26

2024 : తెలంగాణకు చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప కు పద్మశ్రీ అవార్డు లభించింది.

 

2024-01-26

2024 : భారతదేశపు మొదటి మహిళా మావటి (Elephant Handler) ‘పర్బతి బారుహ్‌’ కు పద్మశ్రీ అవార్డు లభించింది.

2024-01-26

2024 : భారతదేశపు మొదటి సంస్కృత హరికథా కళాకారిణి ‘దాలిపర్తి ఉమా మహేశ్వరీ’ కి పద్మశ్రీ అవార్డు లభించింది.

1955-01-08

1955 : పద్మవిభూషణ్ పురస్కారాన్ని ‘పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ’ అనే మూడు విభిన్న అవార్డులుగా వర్గీకరించారు.

 

1998-01-14

1998 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను అందించారు. దీంతో ఆమె ఈ ఘనత అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించింది.