This Day in History: 1953-01-28
1953 : భారతదేశంలో ‘సంగీత నాటక అకాడమీ’ ప్రారంభించబడింది. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు. సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం, నాటక సమాజాలకు చేయూతనివ్వడం, నాటక కళాకారులకు సహాయం చేయడం, నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం, నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం ఇలా వివిధ కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.