- దినోత్సవం
అంతర్జాతీయ తర్కశాస్త్ర దినోత్సవం
- సంఘటనలు
- 1965
1965 : భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1964 చట్టం ప్రకారం 'ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (FCI) స్థాపించబడింది. - 1969
1969 : మద్రాసు రాష్ట్రం పేరు అధికారికంగా తమిళనాడు గా మార్చబడింది. - 1994
1994 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో స్థాపించబడిన మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం' గా పేరు మార్చబడింది. - 1998
1998 : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బులక్ష్మి కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను అందించారు. దీంతో ఆమె ఈ ఘనత అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా చరిత్ర సృష్టించింది.
- జననం
- 1856
1856 : ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు జననం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, న్యాయమూర్తి, రాజకీయవేత్త. 'ద హిందూ' వార్తాపత్రిక సహ వ్యవస్థాపకుడు. - 1896
1896 : పద్మ విభూషణ్ సి డి దేశ్ముఖ్ (చింతమన్ ద్వారకనాథ్ దేశ్ముఖ్) జననం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 3వ గవర్నర్. ఈ పదవిని పొందిన స్వతంత్ర భారతదేశపు మొదటి భారతీయుడు. - 1919
1919 : పద్మశ్రీ కైఫీ అజ్మీ (అథర్ హుస్సేన్ రిజ్వీ) జననం. భారతీయ ఉర్దూ కవి, సినీ నటుడు, రచయిత, గీత రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. - 1921
1921 : బిందేశ్వరి దూబే జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ట్రేడ్ యూనియన్ వాది, రాజకీయవేత్త. బీహార్ 17వ ముఖ్యమంత్రి. బొకారో స్టీల్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు. - 1929
1929 : మౌంటైన్ మేన్ దశరథ్ మాంఝీ జననం. భారతీయ కూలి. గోల్డెన్ గ్లోబ్ హానర్ గౌరవం పొందాడు. 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి అత్రి మరియు వజీర్గంజ్ మధ్య రహదారికి మార్గం సజావు చేశాడు. దీంతో 55 నుండి 15 కిలోమీటర్లకు ప్రయణం తగ్గింది. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. - 1937
1937 : శోభన్ బాబు ( ఉప్పు శోభనా చలపతిరావు) జననం. - 1937
1937 : కళాప్రపూర్ణ రావు గోపాల్ రావు జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, విలక్షణ నటుడు, సహాయ దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త. నట విరాట్ బిరుదు పొందాడు. - 1951
1951 : జంధ్యాల (జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి) జననం. భరతీయ తెలుగు సినీ దర్శకుడు, నాటక రచయిత, సినీ రచయిత. - 1956
1956 : జయ ప్రకాష్ నారాయణ జననం. భారతీయ సివిల్ సర్వెంట్, రాజకీయ సంస్కర్త, కాలమిస్ట్, రాజకీయవేత్త. 'లోక్ సత్తా' రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (NGO) వ్యవస్థపకుడు.
- మరణం
- 2017
2017 : సుర్జిత్ సింగ్ బర్నాలా మరణం. భారతీయ రాజకీయవేత్త. పంజాబ్ 11వ ముఖ్యమంత్రి. ఉత్తరాఖండ్ మొదటి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ 18వ గవర్నర్. తమిళనాడు 8వ గవర్నర్. - 2018
2018 : పద్మ విభూషణ్ టి వి రాజేశ్వర్ (తంగవేలు రాజేశ్వర్ ముదలియార్) మరణం. భారతీయ విద్యావేత్త. పశ్చిమ బెంగాల్ 13వ గవర్నర్. ఇంటెలిజన్స్ బ్యూరో డైరెక్టర్.
చరిత్ర కొనసాగుతుంది..