- సంఘటనలు
1956 : అజ్మీర్ మెర్వాడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి హరిభావు ఉపాధ్యాయ పదవి విరమణ చేశాడు.
1956 : ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి కోకా సుబ్బారావు పదవి విరమణ చేశాడు.
1984 : భారతదేశ 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ప్రమాణ స్వీకారం చేశాడు.
1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ కు నిరసనగా భారత ప్రధాని ఇందిరాగాంధీ పై సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపి హత్య చేశారు. అల్లర్లు చెలరేగి 3,000 మందికి పైగా సిక్కులు చంపబడ్డారు.
2005 : భారత 35వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి నుండి రమేష్ చంద్ర లహోటి పదవి విరమణ చేశాడు.
- జననం
1875 : భారతరత్న వల్లభాయ్ పటేల్ (వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి.
1895 : పద్మ భూషణ్ సి కె నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు) జననం. భారతీయ క్రికెటర్. భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ మ్యాచ్లలో మొదటి కెప్టెన్.
1926 : పద్మ విభూషణ్ నరీందర్ సింగ్ కపానీ జననం. భారతీయ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు, రైతు, పరోపకారి, కళాకారుడు. ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడు.
1938 : సుందరం మాస్టర్ (ముగుర్ సుందర్) జననం. సౌత్ ఇండియన్ సినిమాలో డాన్స్ కొరియోగ్రాఫర్. ఆయన ముగ్గురు కొడుకులు కూడా సినీ నటులు, కొరియోగ్రాఫర్లే. ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డు తో పాటు ఫిల్మ్ ఫేర్ సౌత్, నంది, విజయ అవార్డులను గెలుచుకున్నాడు.
1943 : ఊమెన్ చాందీ జననం. భారతీయ రాజకీయవేత్త. కేరళ 10వ ముఖ్యమంత్రి. ఐక్యరాజ్య సమితి నుండి పబ్లిక్ సర్వీస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ ముఖ్యమంత్రి.
1986 : సంవృత సునీల్ జననం. భారతీయ నటి, టెలివిజన్ ప్రజెంటర్. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో 45 చిత్రాలకు పైగా పనిచేసింది. ఆసియన్ ఫిల్మ్ అవార్డులు అందుకుంది.
- మరణం
1984 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ.
2003 : పద్మ భూషణ్ ఎ ఎస్ రావ్ (అయ్యగారి సాంబశివ రావు) మరణం. భారతీయ శాస్త్రవేత్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వ్యవస్థాపకుడు.
2005 : పద్మ విభూషణ్ అమృతా ప్రీతమ్ సింగ్ (అమృత్ కౌర్) మరణం. పాకిస్తానీ భారతీయ నవలా రచయిత్రి, వ్యాసకర్త, కవయిత్రి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా సమానంగా ఇస్టపడే ప్రముఖ మహిళ.
2005 : పద్మ భూషణ్ పి లీల (పొరయత్ లీల మీనన్) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని, స్వరకర్త, సంగీత దర్శకురాలు.
2019 : గీతాంజలి (మణి) మరణం. భారతీయ తెలుగు నటి, నర్తకి, టీవి ప్రజంటర్, రాజకీయవేత్త. తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ వంటి బహుళ భాషలలో 500 చిత్రాలలో నటించింది. ప్రముఖ నటుడు జి.రామకృష్ణ భార్య. నంది అవార్డు కమిటీలో సభ్యురాలిగా పనిచేసింది. నంది అవార్డు, రైలింగీ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.
చరిత్ర కొనసాగుతుంది..