1995-03-15 – On This Day  

This Day in History: 1995-03-15

1995 : ఆంధ్రప్రదేశలోని పాశర్లపూడి గ్రామం సెక్టార్ 19లో సంభవించిన బ్లో అవుట్ 65రోజుల తరవాత అదుపులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లోఅవుట్‌ గా నమోదైంది. భారతదేశ చమురు మరియు సహజ వాయువు అన్వేషణ చరిత్రలో ఇది అతిపెద్ద బ్లోఅవుట్. 65 రోజుల పాటు అగ్నిప్రమాదం కొనసాగింది. మొదట్లో మంటలను అదుపులోకి తీసుకురావడానికి నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ (NAF, హ్యూస్టన్)ని నియమించారు. ONGC వారి వ్యూహంతో NAF ఏకీభవించకపోవడంతో NAF విడిచిపెట్టి చివరకు 15 మార్చి 1995న ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్ ద్వారా నియంత్రణలోకి వచ్చింది. బ్లోఅవుట్ వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ డ్రిల్లింగ్ రిగ్ నాశనం చేయబడింది. డ్రిల్లింగ్ రిగ్‌కు రూ.9.2 కోట్ల నష్టం వాటిల్లిందని, అలాగే వెల్ సైట్ ప్రాంతంలోని పరికరాలకు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.

Share