1986-06-18 – On This Day  

This Day in History: 1986-06-18

1986 : ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం. సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు. ఆంధ్ర ప్రాచ్య కళాశాల వ్యవస్థాపకుడు.  ఆంధ్ర మహాభారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించాడు. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించాడు. తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించాడు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో శరవేగంగా రాసేవారు. మద్రాసు మెయిల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించాడు.

కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో ఆయన విశిష్టమైన కృషిచేశాడు. ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము’ అనే చక్కని రచన చేశాడు. సోదరుడు ఖండవల్లి బాలేందు శేఖరంతో కలసి తెలుగులోను, ఇంగ్లీషులోను రచించిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ అమూల్యమైన గ్రంథం.

ఆయన స్థాపించిన ఆంధ్ర ప్రాచ్య కళాశాల ప్రస్తుతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాలగా అభివృద్ధి చెందింది.

Share