This Day in History: 2025-08-30
విదుషీ దీక్ష 216 గంటలపాటు నిర్విరామంగా భరతనాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు దక్కించుకుంది.
కర్ణాటకలోని ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా ఆరూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల వి విదుషీ దీక్ష నిర్విరామంగా 216 గంటలపాటు భరత నాట్యం చేసి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్లో చోటు దక్కించుకుంది. 2025 ఆగస్టు 21వ తేదీన భరతనాట్యం ప్రారంభించిన దీక్ష 9వ రోజు 2025 ఆగస్టు 30 మధ్యాన్నం 3.30 గంటలకు 216 గంటల ప్రదర్శన పూర్తిచేసింది. గతంలో మంగళూరుకు చెందిన రెమోనో ఇవెట్ పిరేరా పేరిట ఉన్న 170 గంటల రికార్డును అధిగమించింది.
