This Day in History: 1995-08-09
అస్సాంలోని గౌహతిలో ‘నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్’ (NEDFI) స్థాపించబడినది.
నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది కంపెనీల చట్టం 1956 కింద రిజిస్టర్ చేయబడిన ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ.
ఫిబ్రవరి 23, 1996న భారతదేశ ప్రధానమంత్రి పి వి నరసింహరావు ఈ కార్పొరేషన్ను లాంఛనంగా ప్రారంభించాడు.
ఇది భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో (నార్త్ ఈస్ట్ రీజియన్) పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టుల స్థాపన కోసం సూక్ష్మ, చిన్న, మధ్యస్థ మరియు పెద్ద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
అలాగే, మైక్రోఫైనాన్స్ సంస్థలు లేదా ఎన్జీఓల ద్వారా మైక్రోఫైనాన్స్ సేవలను కూడా అందిస్తుంది.
NEDFi యొక్క షేర్హోల్డర్లలో IDBI, SBI, LICI, SIDBI, ICICI, IFCI, SUUTI, GIC మరియు దాని అనుబంధ సంస్థలు ఉన్నాయి.
ఈ సంస్థ ఈశాన్య భారతదేశంలో ఆర్థిక చేరికను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
