This Day in History: 1905-05-13
1905 : ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది, రాజకీయవేత్త. భారతదేశ 5వ రాష్ట్రపతి. భరత రాష్ట్రపతి పదవి చేపట్టిన 2వ ముస్లిం మరియు పదవిలో మరణించిన 2వ రాష్ట్రపతి. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, AICC సభ్యుడు, గోపీనాథ్ బోర్డోలోయ్ మంత్రిత్వ శాఖలో ఆర్థిక, రెవెన్యూ మరియు కార్మిక మంత్రి, అస్సాం ప్రభుత్వానికి అడ్వకేట్-జనరల్, రాజ్యసభ సభ్యుడు. యుగోస్లేవియా పర్యటన సందర్భంగా 1975 లో కొసావోలోని ప్రిస్టినా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అనేక పర్యాయాలు అస్సాం ఫుట్బాల్ అసోసియేషన్ మరియు అస్సాం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అస్సాం స్పోర్ట్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కూడా. ఆల్ ఇండియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ మరియు ఢిల్లీ జింఖానా క్లబ్లో సభ్యుడు. అస్సాం బార్పేటలో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టారు.
