1848-04-16 – On This Day  

This Day in History: 1848-04-16

1848 : రావ్ బహదూర్ కందుకూరి వీరేశలింగం జననం. భారతీయ సంఘ సంస్కర్త, రచయిత, ఉపాధ్యాయుడు. తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పరిగణించబడ్డాడు. మహిళల విద్య మరియు వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించిన ప్రారంభ సంఘ సంస్కర్తలలో ఒకడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. బాల్య వివాహాలు, వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా పోరాడాడు. 1874 లో దౌలేశ్వరంలో పాఠశాలను ప్రారంభించాడు, 1887లో ‘బ్రహ్మ మందిరాన్ని’ నిర్మించాడు మరియు 1908లో ఆంధ్ర ప్రదేశ్‌లో ‘హితకారిణి పాఠశాల’ని నిర్మించాడు. ఆయన నవల రాజశేఖర చరిత్రము తెలుగు సాహిత్యంలో మొదటి నవలగా పరిగణించబడుతుంది. ఆంధ్ర రాజా రామ్ మోహన్ రాయ్గా పరిగణించబడ్డాడు. గద్య తిక్కన అనే బిరుదుతో పిలుస్తారు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు.

Share