This Day in History: 1937-06-23
1937 : చండ ప్రచండ శిలాభినవకొక్కొండ కొంపెల్ల జనార్దనరావు మరణం. భారతీయ భావ కవి, నాటక రచయిత, సంపాదకుడు.
భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించాడు. 1934 డిసెంబరులో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు. ‘తాన్ సేన్’, ‘తెలుగు’ అనే నాటికలు రచించాడు. ఉదయిని అనే సాహితీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. కృష్ణా పత్రిక వీరికి “చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ” అనే బిరుదు ప్రసాదించింది.