1927-06-27 – On This Day  

This Day in History: 1927-06-27

1927: నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు కాళ్ళకూరి నారాయణరావు మరణం

కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 281871 – జూన్ 271927) నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు.

జననం: ఈయన పశ్చిమ గోదావరి జిల్లావీరవాసరము మండలంమత్స్యపురి గ్రామంలో 1871ఏప్రిల్ 28 న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.

రచనలు:

వరవిక్రయం:

వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.

చింతామణి:

చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్శితమవుతోంది.

మధుసేవ:

మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.

చిత్రాభ్యుదయం:

ఇది రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ, చిత్రాంగికీ నడుమ జరిగిన కథ.

ఇతర రచనలు:

పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.

మరణం:

ఈయన 1927జూన్ 27న మరణించాడు.

శిష్యులు,అభిమానులు:

Share