This Day in History: 1833-09-27
1833 : రాజా రామ్ మోహన్ రాయ్ మరణం. భారతీయ సంఘ సంస్కర్త, మత సంస్కర్త, రచయిత. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడు. బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ II చేత రాజా బిరుదు పొందాడు. సతీసహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.