This Day in History: 1963-02-28
1963 : భారతరత్న రాజేంద్ర ప్రసాద్ మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్రోద్యమకారుడు, న్యాయవాది, ఉపాధ్యాయుడు. భారతదేశ మొదటి రాష్ట్రపతి. రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక భారతీయుడు. మొదటి వ్యవసాయ మంత్రి. భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు. ప్రజలు ప్రేమగా, గౌరవంగా ‘బాబూ’ అని పిలిచేవారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు.