- సంఘటనలు
1949 : ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) వార్తా సంస్థ పనిచేయడం ప్రారంభించింది.
1989 : ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ మిత్రాండ్ తన దేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం "కమాండర్ ఆఫ్ ది లెజియన్ డి'హోన్నూర్" ను సత్యజిత్ రే కు ప్రదానం చేశాడు.
2005 : గోవా ముఖ్యమంత్రిగా ప్రతాప్సింగ్ రాణే పదవి బాధ్యతలు స్వీకరించాడు.
- జననం
1902 : పద్మ భూషణ్ మోటూరి సత్యనారాయణ జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు, రాజకీయవేత్త.
1915 : పద్మ విభూషణ్ కుష్వంత్ సింగ్ (ఖుషాల్ సింగ్) జననం. భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు, చరిత్రకారుడు.
1979 : షమితా శెట్టి జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజెంటర్, ఇంటీరియర్ డిజైనర్, సామాజిక కార్యకర్త.
- మరణం
1829 : రాణి కిత్తూరు చెన్నమ్మ (చెన్నమ్మ దేశాయ్) మరణం. భారతీయ రాణి, స్వాతంత్ర్య సమరయోధురాలు. బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనితలలో ఒకరు.
1982 : మోహన్ లాల్ సుఖాడియా మరణం. భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. 1954 నుండి 1971 వరకు 17 ఏళ్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
2012 : అట్లూరి పుండరీకాక్షయ్య మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత, నిర్మాత, పంపిణీదారు.
2013 : పి షణ్ముఖం (పంచనాథ షణ్ముఖం) మరణం. భారతీయ రాజకీయవేత్త. పాండిచ్చేరి రాష్ట్ర 13వ ముఖ్యమంత్రి.
2023 : పద్మశ్రీ కె విశ్వనాథ్ (కాశినాథుని విశ్వనాథ్) మరణం. భారతీయ సినీ దర్శకుడు, సౌండ్ ఆర్టిస్ట్. కళాతపస్వి బిరుదు పొందాడు.
చరిత్ర కొనసాగుతుంది..
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవగాహన దినోత్సవం.